ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్లో అట్టికా పింఛనర్లు కదంతొక్కారు. రోడ్లపైకొచ్చి నిరసన గళాన్ని వినిపించారు. పింఛన్ సంస్థల విలీనానికి ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ ఆర్థిక మంత్రి క్రిస్టోస్ స్టాయికౌరస్కు మెమోరాండం అందజేశారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏథెన్స్తో పాటు తెస్సాలోనికీలోనూ పింఛనర్లు భారీ ర్యాలీలు నిర్వహించారు. అన్ని పింఛన్లను పెంచాలని, దివ్యాంగులకు జాతీయ పింఛన్ అమలు చేయాలని డిమాండు చేశారు. 2016కి ముందు బీమాదారులకు సమాంతర బీమా ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. ఆరోగ్య విత్హోల్డింగ్` ఈఏఎస్ సంఫీుభావ లెవీ రద్దు చేయాలని, ఉచిత ఆరోగ్యం, వైద్య సంరక్షణ, సామాజిక భద్రతా కోసం డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం థెస్సాలోనికిలో వెనిజులోస్ విగ్రహం వద్ద జరిగిన భారీ ధర్నాలో వందలాది మంది పింఛన్దారులు పాల్గొన్నారు.