బీజింగ్: సీపీసీ నాయకత్వంలో జాతీయ స్వాతంత్య్రం సాధించడంలో, చైనా ప్రజలను విముక్తి చేయడంలో, దేశాన్ని సుసంపన్నంగా, పటిష్ఠం చేయడంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఘన విజయాలు సాధించిందని జిన్పింగ్ పేర్కొన్నారు. ఆగస్టులో జరగనున్న పీిఎల్ఎ 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జరిగిన సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి జిన్పింగ్ పాల్గొన్నారు. ప్రజల సాయుధ దళాల అభివృద్ధికి దోహదపడిన అనుభవజ్ఞులు, వీరులు, ఆర్మీ రోల్ మోడల్స్ ప్రతినిధులకు నివాళులర్పించారు. రక్షణ సంబంధిత, సాంకేతికత, పరిశ్రమలకు తమను తాము అంకితం చేసుకుంటున్న వ్యక్తులను జిన్పింగ్ అభినందించారు. దేశ జాతీయ రక్షణ, సాయుధ బలగాల బలోపేతం చేసే ప్రయత్నాలకు అవిశ్రాంతంగా మద్దతునిచ్చిన పార్టీ కమిటీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నాలకు పీఎల్ఏ మద్దతునిచ్చిందన్నారు. మిలిటరీని బలోపేతం చేయడం, దేశ రక్షణ, సాయుధ బలగాల ఆధునీకరణను వేగవంతం చేయడంపై జిన్పింగ్ ఆలోచనలను పూర్తిగా అమలు చేయాలని సభ్యులు పేర్కొన్నారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ లీ కెకియాంగ్, లి రaాన్షు, వాంగ్ యాంగ్, వాంగ్ హునింగ్, జావో లెజి, హాన్ జెంగ్ , వాంగ్ కిషన్లతో సహా పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.