Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టెక్సాస్ డెయిరీ ఫామ్ లో పేలుడు.. 18 వేల ఆవులు, గేదెలు మృతి

పేలుడు కారణంగా చెలరేగిన మంటలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 18 వేల ఆవులు, గేదెలు మృతి చెందాయి. ఒక డెయిరీ ఫామ్ లో పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 వేల పశువులతో పాటు ఒక అగ్రికల్చర్ వర్కర్ ప్రాణాలు కోల్పోయాడు. టెక్సాన్ అగ్రికల్చర్ కమిషనర్ మిల్లర్ దీనిపై స్పందిస్తూ… టెక్సాస్ చరిత్రలోనే ఇదొక ఘోర అగ్ని ప్రమాదమని అన్నారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంలో సమాచారం లేదని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిన వెంటనే అందరికీ తెలియజేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img