12ఏళ్ల తర్వాత ప్రధాని నివాసం నుంచి బయటకు..
తెల్ అవివ్ : ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన కుటుంబం జెరుసలేంలోని అధికారిక నివాసాన్ని 12 ఏళ్ల తర్వాత ఖాళీ చేశారు. శనివారం రాత్రికి అధికార నివాసం మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం. చివరి రాత్రి కెసరియా ఇంటిలోని షబ్బత్లో నెతన్యాహు కుటుంబం గడిపినట్లు తెలిసింది. ఆదివారానికి ప్రధాని అధికారిక నివాసం నుంచి నెతన్యాహు కుటుంబం నిష్క్రమించినట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. నెల కిందట నెతన్యాహు అధికారాన్ని కోల్పోయారు. నూతన ప్రధానిగా నఫ్తలి బెన్నెట్ జూన్ 13న పగ్గాలు చేపట్టారు.