అబూజా : నైజీరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో సుమారు 43మంది ఆ దేశానికి వాయువ్య దిశలో గల సొకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్లో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. తొలుత కాల్పుల్లో 30మంది చనిపోగా.. 20మందికి తీవ్రగాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. సుమారు 200 మంది మార్కెట్లోకి జొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వీరంతా మోటార్ సైకిళ్లపై వచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 8న కూడా నైజీరియాలో ఇలాంటి ఘటనే జరిగింది. నైజీరియా సరిహద్దుల్లో ఉండే నైజర్కు సమీపంలో ఉన్న ఓ గ్రామ మార్కెట్లోకి చొరబడిన బందిపోట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. నైజీరియాలోని ఇలాంటి హత్యాకాండలు తరచుగా జరుగుతున్నాయి