క్యూబా విదేశాంగమంత్రి బ్రూనో రోడ్రిగ్జ్
హవానా: క్యూబాలో ప్రజా విజయాన్ని కించపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ మండిపడ్డారు. అమెరికా క్యూబాపై అనుసరి స్తున్న నిర్బంధ విధానంలో భాగంగా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు 28మంది క్యూబా అధికారులకు వీసా పరిమితులను ప్రకటించిన నేపథ్యంలో క్యూబా విదేశాంగ మంత్రి రోడ్రిగ్జ్ స్పందించారు. అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ‘2021లో క్యూబాలో ప్రజల్లో తిరుగుబాటును రేకెత్తించే ప్రయత్నం విఫలమైన దృష్ట్యా, అమెరికా ప్రభుత్వం, దాని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇప్పుడు సామ్రాజ్యవాద దురాక్రమణను ఎదుర్కొని ప్రజలు సాధించిన విజయాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టం, ఐక్య రాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘిస్తూ అమెరికా పదేపదే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రెసిడెన్షియల్ ప్రకటన 5377 ప్రకారం… మొత్తం 28 మంది ప్రభుత్వ ఉద్యోగులు, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులను భూభాగంలోకి ప్రవేశిం చకుండా నిషేధించినట్లు బ్లింకెన్ కార్యాలయం శనివారం వెల్లడిరచింది.