రామఫోసా పిలుపు
ఐరాసా : భద్రతా మండలి వ్యవస్థను సంస్కరించాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఐరాస జనరల్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు. జనరల్ అసెంబ్లీ 76వ వార్షికోత్సవ సభలో వర్చువల్లో రాంఫోసా మాట్లాడుతూ..2005లో జరిగిన 16ఏళ్ల తరవాత 2001లో సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలపై మాట్లాడుతూ ప్రపంచ నాయకులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. తక్షణ సంస్కరణల ద్వారా వ్యవస్థను సంస్కరించాలని సభ్యదేశాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆఫ్రికా ఖండంలోని 1.3 బిలియన్ల ప్రజల అభిప్రాయన్ని తాను వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహుళపక్ష వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ఇతర సంబంధిత సమస్యలతోపాటు క్యూబా ప్రజలతో దక్షిణాఫ్రికా సంఫీుభావాన్ని రామఫోసా పునరుద్ఘాటించారు. అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని పేర్కొన్నారు. క్యూబాపై ఆంక్షలు ఆ దేశ ఆర్థికప్రగతికి ఎనలేని నష్టం కలిగించాయని ఆయన స్పష్టం చేశారు. పలస్తీనా ప్రజలు స్వయం నిర్ణయాధికార హక్కులను కూడా ఆయన సమర్థించారు. ఇజ్రాయిల్ ఆక్రమణలనుండి పలస్తీనా ప్రజలు విముక్తి పొందేంతవరకు శాంతి,న్యాయంకోసం తాము పోరాడుతామని రామఫోసా పేర్కొన్నారు. ఆఫ్రికన్ యూనియన్, ఐరాస భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా పశ్చిమ సహారా ప్రజలకు స్వీయ నిర్ణయాధికార హక్కు ఉందని పునరుద్ఘాటించారు. జింబాబ్వే ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేసే ఆంక్షలను ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. డర్బన్ డిక్లరేషన్, కార్యాచరణ ప్రణాళిక 20వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమాజం జాత్యహంకారం, అసహనానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రోత్సహించారు.
కోవిడ్`19 నుండి కోలుకోవడం, ప్రజల హక్కులను గౌరవించడం, స్థిరమైన మార్గంలో పునర్నిర్మాణం, ఐక్యరాజ్యసమితికి పునరుజ్జీవన చర్యలుగా రాంఫోసా పేర్కొన్నారు.