సోదాలు చేపట్టిన భద్రతా బలగాలు
భారత్..పాకిస్థాన్ సరిహద్దులో భారీ పేలుడు సంభవించింది. దాంతో అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు. ఈ మేరకు పేలుడు కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో బుధవారం రాత్రి పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కథువా జిల్లా హీరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని బోర్డర్ పోలీస్ పోస్ట్ సానియాల్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.డ్రోన్ ద్వారా తీసుకెళ్లి సరిహద్దుకు సమీపంలో అనుకున్న టార్గెట్ కాకుండా వేరే ప్రదేశంలో పడేసిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) కారణంగానే ఈ శక్తివంతమైన పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నట్టు మీడియా నివేదికలు చెబుతున్నాయి.