విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స శుక్రవారం తిరిగి స్వదేశం చేరుకున్నారు. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో రాజపక్స ఆ దేశాన్ని విడిచి పారిపోయారు. దాదాపు ఏడు వారాల తర్వాత ఆయన తిరిగి శ్రీలంకలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, రాజకీయవేత్తలు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. విమానం నుంచి గోటబాయ దిగగానే రాజకీయవేత్తలు పూలమాలలతో పరుగెత్తుకు వచ్చినట్లు ఓ ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. జూలై నెలలో మిలిటరీ సహాయంతో రాజపక్స దేశాన్ని విడిచి వెళ్లారు. ఆర్థిక సంక్షోభాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు భారీ సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తొలుత సింగపూర్, ఆ తర్వాత థాయిలాండ్ వెళ్లిన గోటబాయ తన రాజీనామా లేఖను పంపారు. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోటబాయ బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా లంక చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన ఓ థాయిలాండ్ హోటల్లో ఉన్నారు.