Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మారిబ్‌లో వైమానిక దాడులు – 80మంది మృతి

మారిబ్‌: యెమెన్‌ నగరమైన మారిబ్‌లో ప్రభుత్వ అనుకూల దళాలు, తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన పోరాటంలో బుధవారం 80 మంది మృతి చెందారు. 24గంటల్లో జరిగిన వైమానిక దాడుల్లో 60 హౌతి రెబల్స్‌ మరణించారు. 18మంది ప్రభుత్వ అనుకూల దళాలు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. సౌదీ నేతృత్వంలోని సైనిక సంకీర్ణ మద్దతు ఉన్న యెమెన్‌ ప్రభుత్వానికి, ఇరాన్‌ మిత్రపక్షమైన హౌతి తిరుగుబాటుదారులకు మధ్య కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి. తమను లక్ష్యంగా చేసుకుని సైనికులు సమారు 30 వైమానిక దాడుల జరిపాయని రెబెల్స్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img