Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాలిలో ఉగ్ర దాడి మాలిలో ఉగ్ర దాడి : 40 మంది మృతి


నైజర్‌ : ఆఫ్రికా ఖండ దేశం మాలిలో జీహాదీలు ఊచకోతకు ఒడిగట్టారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు. నైజర్‌ బోర్డర్‌ సమీపంలో ఉన్న ఓ గ్రామంపై జీహాదీలు దాడి చేశారు. కౌర అనే గ్రామంలో 20 మందిని, ఓటగాపులో 14 మందిని, డెత్‌గెఫ్ట్‌లో కొందరిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మోటార్‌ బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు గ్రామంలో బీభత్సం సృష్టించారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో 2012 నుంచి జీహాదీలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. అల్‌ఖైదాకు చెందిన సాయుధ దళాలు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి జరుగతుతున్న ఊచకోత వల్ల వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img