Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం : 41 మంది దుర్మరణం

బమాకో : ఆఫ్రికా దేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ, బస్సు ఢీ కొనడంతో 41 మంది మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ అదుపు తప్పడంతో బస్సు మీదకి దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఈ ప్రాంతమంతా భీకర వాతావరణం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. వస్తువులు, కార్మికులతో వెళుతున్న లారీ ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్‌ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్‌ పేలడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి బస్సు మీదకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని సెగో పట్టణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img