Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మాల్దీవ్స్‌లో అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు మృతి

మాల్దీవ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవియన్‌ రాజధాని మేల్‌లోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు కాగా, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. మేలేలోని రద్దీ ప్రాంతంలో గల ఓ భవనంలో మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెహికల్‌ రిపేర్‌ గ్యారేజీ ఉందని.. అందులో మంటలు చెలరేగి పై అంతస్తు వరకు పాకాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బాధితుల్లో పొరుగ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిరచారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img