Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లంక మాతను సంక్షోభం నుంచి గట్టెక్కించాలి

ప్రధాని మోదీ, భారత ప్రజలకు ఆ దేశ విపక్ష నేత సజిత్‌ ప్రేమదాస విన్నపం
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, భారత్‌ సాయాన్ని కోరుతూ ఆ దేశ విపక్ష నేత సజిత్‌ ప్రేమదాస చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా… లంక మాతను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని గౌరవనీయులైన భారత ప్రధాని మోదీని, అన్ని రాజకీయ పార్టీలను, భారతదేశ ప్రజలను కోరుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. శ్రీలంకకు పెద్దన్న మాదిరి ఉండే భారత్‌ తన సహాయ, సహకారాలను కొనసాగించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img