Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బ్రిటన్‌ రాజుగా ప్రిన్స్‌ చార్లెస్‌..

కరెన్సీ, జాతీయ గీతం సహ పలు మార్పులు
క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె వారసుడిగా కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాజుగా జాతినుద్దేశించి శుక్రవారం తొలి ప్రసంగం చేయనున్నారు. ముందుగానే ప్రసంగాన్ని రికార్డ్‌ చేసి విడుదల చేస్తారు. అయితే, దీనికి సంబంధించిన వివరాలను ప్యాలెస్‌ విడుదల చేయలేదు. రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని లిజ్‌ ట్రస్‌తో మొదటి సమావేశం నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎలిజబెత్‌ మరణానికి రెండు రోజుల ముందే ట్రస్‌ ప్రధానిగా నియమితులైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంగళవారం ట్రస్‌ను రాణి ప్రధానిగా నియమించారు.
అనంతరం క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల కోసం విస్తృతమైన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో చర్చింనున్నారు. రాజ కుటుంబం సంతాప కాల వ్యవధిని నిర్ణయిస్తారు. ఇది ఒక నెల పాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రభుత్వం 10 రోజుల అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరానికి ఒక రౌండ్‌ చొప్పున 70 రౌండ్లు పాటు సెంట్రల్‌ లండన్‌లోని పురాతన రాజకోట లండన్‌ టవర్‌ నుంచి కాల్పులు జరిపి సెల్యూట్‌ చేస్తారు. వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బే, సెయింట్‌ పాల్స్‌ కేథడ్రల్‌, విండ్సర్‌ కాజిల్‌లో ఇతర ప్రదేశాలలో మఫిల్డ్‌ చర్చి గంటలు మోగిస్తారు. జాతీయ జెండాలు సగానికి ఎగురవేస్తారు. ప్రధాని ట్రస్‌, ఇతర సీనియర్‌ మంత్రులు సెయింట్‌ పాల్స్‌లో ప్రజా సంస్మరణ సభకు హాజరుకానున్నారు. యూకే పార్లమెంట్‌ రెండు రోజుల ప్రత్యేక నివాళులర్పిస్తుంది.క్వీన్‌ ఎలిజబెత్‌ 2 తర్వాత ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కింగ్‌ అయ్యారు. ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ కింగ్‌ అయినప్పుడు, ఆయన భార్య కెమిల్లా క్వీన్‌ కన్సార్ట్‌ అవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు. కింగ్‌ భార్యను క్వీన్‌ కన్సార్ట్‌గా పేర్కొంటారు. ప్రిన్స్‌ చార్లెస్‌ కింగ్‌ అవ్వడంతో కోహినూర్‌ వజ్రం ఉన్న కిరీటాన్ని క్వీన్‌ కన్సార్ట్‌గా కెమిల్లా అందుకుంటుంది.
గత 11 శతాబ్దాలుగా బ్రిటన్‌లో రాయల్‌ మింట్‌ కరెన్సీని విడుదల చేస్తూ వస్తోంది. చక్రవర్తి ముఖచిత్రాలతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. 1952లో రాణిగా ఎలిజబెత్‌ 2 పట్టాభిషేకం తర్వాత బ్రిటన్‌, కామన్వెల్త్‌ దేశాల్లో ఆమె బొమ్మతో రూపొందించిన నాణేలు, కరెన్సీ నోట్లు విడుదల చేశారు. ప్రతి పదేళ్లకు ఆమె గౌరవార్థం కొత్త నాణేలను రూపొందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బ్రిటన్‌ రాజుగా కింగ్‌ ఛార్లెస్‌ 3 సింహాసం అధిష్టించనుండటంతో కరెన్సీలో మార్పులు జరగనున్నాయి.
ఛార్లెస్‌ ఫొటోతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రించనున్నారు. అంతేకాదు, యూకే కరెన్సీపై రాణి ఎలిజబెత్‌ చిత్రం కుడివైపున.. కొత్తగా ముద్రించే నోట్లపై ఛార్లెస్‌ చిత్రం ఎడమవైపున ఉండనుంది. కరెన్సీ నోట్లపై రాణి లేదా రాజు చిత్రాలు అంతకుముందు పాలించిన వారికి అభిముఖంగా ఉండటం గత 300 ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయం. 1956 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ విడుదల చేసే కరెన్సీ నోట్లపైనా రాణి ఎలిజబెత్‌ చిత్రాలను ముద్రిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img