Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విమానాలు నడపాలని భారత్‌కు తాలిబన్ల లేఖ

న్యూదిల్లీ : భారత ప్రభుత్వంతో అఫ్గానిస్థాన్‌ లోని తాలిబన్ల ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రెండు దేశాల మధ్య కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్‌ ను కోరింది. ఈ మేరకు భారత డీజీసీఏకు అఫ్గానిస్థాన్‌ పౌరవిమాన యాన శాఖ లేఖ రాసింది. అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌ తో అధికారికంగా సంప్రదింపులు జరపడం ఇదే ప్రథమం. అఫ్గానిస్థాన్‌ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి హమీదుల్లా పేరిట ఈ లేఖ అందింది. ‘అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లే సమయంలో కాబూల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఖతార్‌ అందించిన సాంకేతిక సహాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాం. భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల మధ్య విమానాల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం’ అని లేఖలో తాలిబన్‌ ప్రభుత్వం విన్నవించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img