దేశాన్ని విడిచి వెళ్లేందుకు అఫ్గాన్ వాసుల ప్రయత్నాలు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సీటు దొరక్క చక్రాలుపట్టుకుని, రెక్కలు పట్టుకుని ఎగురుతున్న తీరు అత్యంత దయనీయంగా ఉంది. కాబూల్ విమానశ్రయం నుండి బయల్దేరిన యుఎస్ ఎయిర్ఫోర్స్ సి17 ఖతార్లో ల్యాండైంది. అక్కడ విమానాన్ని పరిశీలించగా ల్యాండిరగ్ గేర్వీల్ వెల్లో మానవ అవవేశాలను గుర్తించారు. విమానం గాల్లో ఎగురుతున్న సందర్బంలో అఫ్గాన్ వాసులు విమానచక్రాలను పట్టుకుని కనిపించారు. విమానం గాల్లో ఎగిరిన తర్వాత వీరు చక్రాల్లో ఇరుక్కొని ఉండవచ్చునని అంచనా.. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం కింద ఎవరైనా పడిపోయి ఉండవచ్చునని తెలుస్తోంది.