Friday, April 19, 2024
Friday, April 19, 2024

శాంతియుత పరిష్కారమే కోరుకుంటున్నా: పుతిన్‌


మాస్కో: వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని ప్రపంచం ఆశతో ఎదురు చూస్తున్నది. కానీ, అది ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. అయితే పశ్చిమ దేశాలు మాత్రం సమస్యను జఠిలం చేస్తున్నాయన్నారు. సోమవారం ఆయన ఫెడరల్‌ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆయన అన్నారు. పదేపదే ఆయన ఆ ఆరోపణలే చేశారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని, తూర్పు దేశాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సమస్యను పశ్చిమ దేశాలు ప్రపంచ సమస్యగా మారుస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. నాటో దళాన్ని పెంచుతూ.. పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని, వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్‌ తెలిపారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించామన్నారు. కానీ పశ్చిమ దేశాలు క్రూరపద్ధతిలో వ్యవహరించాయన్నారు. సైనికులకు, వాళ్ల కుటుంబాలకు పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. పుతిన్‌ తన ప్రసంగంలో ఎల్జీబీటీ హక్కుల గురించి మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. ఫ్యామిలీ అంటే ఆడ, మగ కలయిక అని, ప్రతి మత గ్రంథాలు ఈ విషయాన్నే చెబుతాయని, కానీ ఆ పవిత్ర గ్రంథాలను పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయన్నారు. దిగజారుడతనం నుంచి మన చిన్నారుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img