Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శ్రీలంకలో ఆహార సంక్షోభం

వెల్లువెత్తిన ప్రజా నిరసనలు

కొలంబో : ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. దాదాపు 2.18 కోట్లకుపైగా జనాభా ఉన్న శ్రీలంకలో ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. నిత్యావసర ఆహార పదా ర్ధాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తి వేయడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి రూ.2,657కు చేరింది. కేజీ పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ.1195గా ఉంది. విదేశీ మాదకద్రవ్యాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు శ్రీలంక పరిస్థితిని మరింత దుర్బలంగా చేశాయి. అనాలోచిత నిర్ణయాలతో దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. కరోనా దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడిరది. దిగుమతులపై నిషేధం విధించడంతో నిత్యావసరాలైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయలు ధరలు విపరీతంగా పెరి గాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. ధరలపై నియంత్రణ తీసుకు రావడంతో దేశంలో అక్రమ నిల్వలు పెరిగి సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడిరది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యం లోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరలు పెరిగాయి. గత శుక్రవారం రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర.. రూ.2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్‌ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img