Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శ్రీలంక మాజీ అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు..

శ్రీలంక పొడుజన పెరమున పార్టీకి చెందిన దుమిండ సిల్వకు క్షమాభిక్ష పెట్టిన కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. రాజపక్స కు సమన్లు జారీ చేయడం ఇది రెండవ సారి. 2011లో జరిగిన ఓ మర్డర్‌ కేసులో సిల్వా నిందితుడు. అతనికి 2017లో మరణశిక్షను ఖరారు చేశారు. మాజీ ఎంపీ ప్రేమచంద్ర సన్నిహితుడిని సిల్వా హత్య చేశాడు. అయితే జూన్‌ 2021లో అతనికి రాజపక్స క్షమాభిక్ష పెట్టారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆ క్షమాభిక్షను రద్దు చేసింది. సిల్వాను మళ్లీ అరెస్టు చేయాలని ఆదేశించింది. డిసెంబర్‌ 16న రాజపక్స కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img