Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘సోషలిజానిదే భవిష్యత్తు’

యువ కమ్యూనిస్టుల సమావేశం
‘భవిష్యత్తు సోషలిజానిదే..’ అనే నినాదంతో ప్రారంభమైన కమ్యూనిస్టు యూత్‌ ఆఫ్‌ గ్రీస్‌ (కేఎన్‌ఈ) 30వ సామ్రాజ్యవాద వ్యతిరేక శిబిరం గ్రీస్‌లోని మైటిలీన్‌లో సఫోస్‌ స్క్వేర్‌ వద్ద భారీ రాజకీయ ర్యాలీతో శనివారం ముగిసింది. గ్రీసు లెస్వోన్‌లోని మైటిలీన్‌లో ఈ శిబిరం ప్రారంభమైంది. కమ్యూనిస్టు యూత్‌ ఆఫ్‌ టర్కీ (టీకేజీ) ప్రతినిధి బృందం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. ఈ సమావేశంలో కేఎన్‌ఈ సెంట్రల్‌ కౌన్సిల్‌ కార్యదర్శి నికోస్‌ అబాటిలోస్‌ కీలక ఉపన్యాసం చేశారు. గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ టర్కీ (టీకేపీ) సెక్రటరీలు డిమిట్రిస్‌ కౌట్సౌంబాస్‌, కెమల్‌ ఒకుయాన్‌ మహాసభల సందర్భంగా యువతకు అభినందన సందేశాలు పంపారు. భవిష్యత్తు సోషలిజానిదే అన్న బ్యానర్లు చేపట్టి యువత అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. 1991 నుంచి సాంప్రదాయకంగా కొనసాగుతున్న గ్రీస్‌ కమ్యూనిస్టు యూత్‌ సమావేశాలకు ప్రతి దేశం, ప్రాంతం నుండి వేలాదిమంది యువ కమ్యూనిస్టులు, మహిళలు, పురుషులు పాల్గొంటారు. ఈ సమావేశం కేకేఈ, టీకేపీల మధ్య సోదర సంబంధాన్ని మరింత మెరుగుపరిచింది. ఈ సమావేశం రెండు దేశాల శ్రామిక ప్రజల మధ్య సంఫీుభావానికి ఆదర్శంగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img