Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

24న మోదీ, బైడెన్‌ల భేటీ

వాషింగ్టన్‌: భారత్‌` అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వాషింగ్టన్‌ వేదిక కానుంది. ఈ నెల 24న భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షడు బైడెన్‌లు భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్‌ దేశాధినేతల భేటీలో మోదీ, జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌లతో బైడెన్‌ సంప్రదింపులు జరుపుతారు. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ, బైడెన్‌లు ఫోన్‌, వీడియో ల ద్వారా సంప్రదింపులు జరిపారు. ముఖాముఖి భేటీలో బైడెన్‌, మోదీ రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి వివిధ కీలక అంశాలపై చర్చిస్తారని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img