ఏథెన్స్: సామ్రాజ్యవాద యుద్ధాలను తిరస్కరించాలన్న నినాదంతో గ్రీస్ యువ కమ్యూనిస్టుల సామ్రాజ్యవాద వ్యతిరేక క్యాంపు జులై 4
7 తేదీల్లో జరగబోతోంది. కేఎన్ఈ అధ్వర్యంలో ఇలా క్యాంపు నిర్వహించడం ఆనవాయితీ కాగా ఈ ఏడాది జరగబోయేది 33వ క్యాంపు జరగనుంది. చల్కిడికి దీపంలోని సముద్రతీర గ్రామమైన పోసిడి ఇందుకు వేదికైంది. ఇది గ్రీస్లోని రెండవ అతిపెద్ద నగరం థెస్సాలోనికికి 105 కిమీల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం వలే ఈ ఏడాది కూడా గ్రీస్ యువత వందల సంఖ్యలో హాజరవుతారు. క్యాంపులో భాగంగా అనేక రాజకీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా యువత గళం వినిపిస్తారు. నాటోఅమెరికా
ఈయూ ప్రణాళికల్లో గ్రీస్ భాగస్వామ్యాన్ని ఖండిస్తారు. యుగోస్లేవియాపై నాటో మారణహోమానికి 25 ఏళ్లు అయిన సమయంలో ఈ క్యాంపు జరుగుతుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడిరది.