బీజింగ్: సిరియా జాతీయ వనరులను కొల్లగొట్టడాన్ని అమెరికా తక్షణమే ఆపాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెచ్చరించారు. అమెరికా ఆక్రమణ దళాలు ఇటీవల సిరియా నుండి దొంగిలించబడిన చమురును ఇరాక్ ఉత్తరానకి బదిలీ చేశాయని నివేదికలపై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు వాంగ్ వెన్బిన్ విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు, అమెరికా, దాని మిత్రదేశాలు సముద్రపు దొంగల వలె వ్యవహరిస్తున్నారని సిరియా అధికారులు అసహనం వ్యక్తం చేశారు. సిరియన్ జనాభాలో 90 శాతం మంది ప్రస్తుతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. జనాభాలో మూడిరట రెండు వంతుల మంది మానవతా సహాయంపై ఆధారపడుతున్నారు, జనాభాలో సగానికి పైగా ఆహార అభద్రతతో బాధపడుతున్నారని వాంగ్ చెప్పారు. అమెరికా మిలిటరీ ఇప్పటికీ సిరియాలో ధాన్యం, చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలను ఆక్రమించింది, సిరియన్ జాతీయ వనరులను దోచుకోవడం, మానవతా సంక్షోభాన్ని మరింత దిగజార్చడమేనని వాంగ్ పేర్కొన్నారు. కొంతమంది సిరియన్లు సిరియాలో అమెరికా ఉనికిని భూతంలా అభివర్ణించారు. సిరియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను అమెరికా గౌరవించాలి, సిరియాపై ఏకపక్ష ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి, సిరియా జాతీయ వనరులను దోచుకోవడం తక్షణమే ఆపివేయాలని వాంగ్ స్పష్టం చేశారు.