Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నార్పల మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధిక శాఖ అధికారి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వీరబ్బాయ్ శుక్రవారం అక్కం పల్లి మరియు నార్పల మండలం నర్సాపురం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కంపల్లి గ్రామంలో జిల్లా మలేరియా అధికారి ఓబులు గారితో కలిసి ప్రతి శుక్ర వారం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే డ్రై డే – ఫ్రై డే కార్యక్రమ నిర్వహణ ను పరిశీలించారు. అలాగే నులి పురుగుల నివారణ కార్యక్రమం లో గర్భవతులకు ప్రత్యేకంగా అందించే నులి పురుగుల నివారణా మాత్రలు ఆల్బెండజోల్ ను వారికి అందించారు. అదే విధంగా నార్పల మండలం నర్సాపురం గ్రామంలో ఫ్యామిలీ ఫీజీషియన్ కాన్సెప్ట్ డాక్టర్ కార్యక్రమం లో సంభందిత ప్రోగ్రాం అధికారి డా సుజాత గారితో కలిసి తనిఖీ నిర్వహించారు. అక్కడి వైద్యాధికారి మరియు సిబ్బంది కి తగు సూచనలు,సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డా. జగదీష్ , ఏ ఎం ఒ సత్య నారాయణ,104 మానేజర్ కృష్ణమూర్తి, నూర్ బాషా, శ్రీరాములు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img