Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిభకు పురస్కారం

విశాలాంధ్ర -రాజంపేట: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో గురువారం సబ్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ చేతుల మీదుగా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అందులో భాగంగానే రాజంపేట మున్సిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సి ఓ గా పనిచేస్తున్న లోమడ భాస్కర్ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం వచ్చేందుకు సహకరించిన కమిషనర్ జనార్దన్ రెడ్డికి, మేనేజర్ శేషపానికి, సిటీ మిషన్ మేనేజర్ రాజేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img