విశాలాంధ్ర -రాజంపేట: మండలంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మదన గోపాల పురం మాజీ ఎంపిటిసి యేసురు రెడ్డయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసురు రెడ్డయ్య మాట్లాడుతూ నిగర్వి పేదల పాలిట పెన్నిధి మల్లిఖార్జున రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుని అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డిని కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు కె.విశ్వనాథరాజు, యస్.రామకృష్ణ, జె.బాస్కర్,వి.శివ,వై.హరికృష్ణ,ఆర్.శివరాం,బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.