అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన మదన్ రెడ్డి
పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
విశాలాంధ్ర-రాజంపేట : వైకాపా నాయకుడు గాలివీటి విజయసాగర్ రెడ్డి (మదన్ రెడ్డి) పుట్టినరోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం మదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాజంపేట నియోజకవర్గం కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో అభిమానులు, కార్యకర్తల మధ్యన కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మొదటగా మదన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఓసి క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పాత బస్టాండ్ కోడలిలో కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తాను రాజకీయాలలోకి రావడం జరిగిందని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రజా సేవలోనే కొనసాగుతానని అన్నారు. తన పుట్టినరోజు వేడుకలకు సినీ దర్శకుడు శివమణి రెడ్డి, పెద్దవీడు సింగిల్ విండో అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులు అభిమానులు, కార్యకర్తల మధ్యన జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. మదన్ రెడ్డి 45వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, కౌన్సిలర్ రాఘవేంద్ర వర్మ, వీరబల్లి మండలం వైసీపీ నాయకులు కల్లూరి రామకృష్ణారెడ్డి, తాటిగుంట పల్లె సర్పంచ్ సాధు గోపినాథ్ రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, జడ్పిటిసి గడికోట ఉషా సుబ్బారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి, సర్పంచ్ జయచంద్ర, ఉప సర్పంచ్ ఇబ్బులు, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.