Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వ పెన్షనర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా పిల్లి పిచ్చయ్య, కార్యదర్శిగా కృష్ణయ్య

విశాలాంధ్ర -రాజంపేట: పట్టణ కేంద్రంలోని ఎన్జీవో కార్యాలయంలో గురువారం ప్రభుత్వ పెన్షనర్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ తాలూకా ఎన్నికలను జనరల్ బాడీ ద్వారా ఎం రామమూర్తి నాయుడు ఎన్నికల అధికారిగాను, బాల ఎల్లారెడ్డి సహాయ ఎన్నికల అధికారిగాను వ్యవహరించారు. అలాగే ఎన్జీవో అధ్యక్షులు బి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసులు, తాలూకా అధ్యక్షులు ఎస్పి రమణ, కార్యదర్శి వి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. తాలూకా అధ్యక్షులుగా పి.పిచ్చయ్య, సహాధ్యక్షులుగా జి.వి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులుగా కేవీఎస్ లక్ష్మి, ఇక్బాల్, ఏ.వి వసంతరాయుడు, ఎస్.ఎం.డి గౌస్ ఖాన్, సీ.నాగయ్య లు ఎన్నికయ్యారు. అలాగే, కార్యదర్శి గా కె.వి కృష్ణయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కె.నరసింహులు, సంయుక్త కార్యదర్సులుగా బి.జయమ్మ, పి.సుబ్బరాయుడు, పి.రామచంద్రయ్య, ధనుంజయ, కె.వి నరసింహులు, గౌరవ అధ్యక్షులుగా వేంపల్లి సుబ్బన్న, ముఖ్య సలహాదారుగా ఓ.శివారెడ్డి, సలహాదారుగా ఆదిశేషారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పాటైన పెన్షనర్ల కార్యవర్గం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుందని అధ్యక్షుడు పిచ్చయ్య తెలియజేశారు. అనంతరం ఎన్నికైన వారిని శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పి జయ ప్రకాష్,కోశాధికారి వరదయ్య, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img