విశాలాంధ్ర -రాజంపేట: అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో కోడలు తలనరకి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన సంఘటన సంచలనీయంగా మారింది.వివరాల్లోకి వెళితే రాయచోటి లోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుందర (35) తల నరికి తలను పట్టుకొని స్టేషన్ కు వచ్చింది. ఆమె చేతిలో తల ఉండడంతో పట్టణ పోలీసులు నిర్వెర పోయారు. ఈ సంఘటన చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్టేషన్ చరిత్రలో ఇటువంటి ఘటన ఇదే ప్రదమం అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.