ఎంఎఫ్ సేవలు స్ఫూర్తిదాయకం
విశాలాంధ్ర – గూడూరు : గూడూరు పట్టణంలోని బనిగిసాహెబ్ పేటలో ఉన్న అంగన్ వాడీ స్కూల్ కు బుధవారం ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్ అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్దాపక అధ్యక్షులు ఎండీ. మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు సేవ చేయడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ఎటువంటి వసతులు కావాలని కోరినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీనియర్ మైనారిటీ నాయకులు ఎండీ. అన్వర్ బాష మాట్లాడుతూ ఎంఎఫ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేస్తున్న మగ్ధూమ్ భాయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఎంఎఫ్ ట్రస్ట్ ఆపన్నులకు అభయ హస్తం అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా అంగన్వాడీ స్కూళ్లు, ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో చిన్నారులను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ అందిచడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈద్గాప్ా యూత్ అధ్యక్షులు షేక్. షబ్బీర్ మాట్లాడుతూ ఎంఎఫ్ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు. అలాగే మైనారిటీలలో విద్యాశాతం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త షాహిదాకు సీలింగ్ ఫ్యాన్ అందించారు. చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ. మగ్ధూమ్ మొహిద్దీన్, ఎండీ. అన్వర్ బాష, షేక్. జమాలుల్లా, షేక్. షబ్బీర్, షేక్. యస్థాని, కరీముల్లా, ఎస్కే. జమీర్, సయ్యద్ గయాజ్, అంగన్వాడీ కార్యకర్తలు షాహిదా, షబానా తదితరులు పాల్గొన్నారు.