Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అధికార ప్రతిపక్షాలపై బీజేపీ నాయకుల ఫైర్..

విశాలాంధ్ర-నందిగామ రూరల్ : ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం అధికార పార్టీ వారి అవినీతిని ప్రశ్నిస్తోందని దానికి సమాధానం చెబుతూ అధికార పార్టీ కాలయాపన చేస్తుందని భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కేదార్నాథ్ శర్మ బుధవారం నందిగామ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులను అధికార పార్టీ ప్రతిపక్షాలు వారి సొంత ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్న తీరుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నియోజకవర్గం అభివృద్దికి కేంద్ర నిధులు 2500 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని,ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో జిల్లా కలెక్టర్ సమక్షంలో బహిరంగ చర్చకురావాలని డిమాండ్ చేశారు తెదేపా,వైకాపా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసలు విషయాలు దాచి కార్యకర్తల్ని బలి కొంటున్నారని ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటికీ ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఫోటోలు వేసుకొని చలామణి అవటం సిగ్గుచేటనీ ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తొర్లకొండ సీతారామ్ బిజెపి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img