విశాలాంధ్ర-వత్సవాయి : మండలంలోని దబ్బాకుపల్లి గ్రామం లో మంగళవారం కొమరగిరి చారిటబుల్ సొసైటీ మరియు చిన్నవటపల్లి పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దబ్బాకుపల్లి మరియు పరిసర గ్రామాల నుండి దాదాపు 80 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.వారిలో నలుగురికి కంటి ఆపరేషన్ కి రిఫర్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, కొమరగిరి చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు కొమరగిరి భరద్వాజ్, శ్రీ సాయి సెంచరీ స్కూల్ ప్రిన్సిపాల్ కొమరగిరి సవిత, పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాల డాక్టర్ పూజిత , మానస, పీ ఆర్వో రాఘవ, గ్రామ నాయకులు షేక్ జానీ, దబ్బాకుపల్లి సచివాలయం సిబ్బంది తదితరులు పాలుగొన్నారు.