Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కారు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర`నందిగామ : ఎన్టీఆర్‌ జిల్ల్ఠా నందిగామలో మునగచర్ల జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు.మునగచర్ల కోల్డ్‌ స్టోరేజ్‌లో విధులు నిర్వహిస్తూ విరామం కోసం బయటికి వచ్చి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే కారు అతివేగాన్ని అదుపు చేయలేక ఆ వ్యక్తి ని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లినట్లు స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నక్క సింహాచలంగా(45) సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img