Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొమరగిరి చారిటబుల్ ట్రస్తు ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్:


విశాలాంధ్ర- వత్సవాయి : మండలంలోని మక్కపేట గ్రామంలో కొమరగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సవిత భరద్వాజ్ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు కనగాల రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు….. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కొమరగిరి చారిటబుల్ ట్రస్ట్ ఇటీవల కాలంలో కంటి క్యాంపులు నిర్వహించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత చెకప్ మరియు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం అభినందనీయమని అన్నారు…… షటిల్ వంటి ఆటలు పోటీలు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత యొక్క నైపుణ్యాలు వెలికి తీయడం జరుగుతుందని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో కొమరగిరి రవీంద్ర భరద్వాజ్, మామిళ్ళపల్లి అప్పారావు, కొండబోలు నారాయణ, అజ్మీరు కొండ మాస్టర్, బొర్రా సురేంద్ర రావు, కేవైయన్ శర్మ, వంగర చంద్రమోహన్, యుగేందర్ శర్మ, చింతల శ్రీనివాస్, కొమరగిరి శ్రీను, బ్రహ్మం పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img