Friday, April 19, 2024
Friday, April 19, 2024

గవర్నమెంట్‌ గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థునులకు దుప్పట్లు పంపిణీ

విశాలాంధ్ర – మైలవరం: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాల యన్‌.యస్‌.యస్‌. యూనిట్‌ ఆధ్వర్యంలో మైలవరం గవర్నమెంట్‌ గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థునులకు దుప్పట్లు పంపిణి చేయటం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.అప్పారావు మాట్లాడుతూ, విద్యార్థునులకు గవర్నమెంట్‌ స్కూల్‌ లో చదువుకోవడం వలన ఐ.ఐ.టి లాంటి మంచి కళాశాలలో చదువుకోవచ్చని , తద్వారా గవర్నమెంట్‌ జాబ్‌ లు పొందే అవకాశం ఉందని , హాస్టల్‌ లో ఉండడం వలన తోటి స్నేహితులతో డౌట్స్‌ ను నివృత్తి చేసుకోవచ్చని ఇంకా సబ్జెక్టుల మీద జ్ఞానాన్ని పెంపొందిచుకోవచ్చని తెలిపారు.అనంతరం హాస్టల్‌ లోని 110 మంది విద్యార్థునులకు దుప్పట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.అప్పారావు చేతుల మీదుగా పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌ .ఎస్‌ .ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా.బి.శివహారి ప్రసాద్‌ , శ్రీ.ఎస్‌ ఉమా మహేశ్వర రెడ్డి ,కళాశాల ఎన్‌.ఎస్‌.ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img