Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గూడూరులో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాలాంధ్ర- గూడూరు : పెడన నియోజకవర్గం గూడూరు మండలం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గూడూరు శాఖ గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ వర్గీకరణలో మెలుకువలు తెలిపిన ఎస్‌. ఆర్‌ రంగనాథన్‌ ,చిత్రపటానికి గూడూరు సిహెచ్‌ సి డైరెక్టర్లు బత్తిన. త్రీ నాథ్‌, ఎండి సలీం ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎండి బషీర్‌ చేతుల మీదగా పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ ను ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుని ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ విద్యార్థులకు గ్రంథాలయ అవగాహన అనే అంశంపై వ్యక్తిత్వం పోటీలు నిర్వహించటమైనది. బి డి సి సిబ్బంది కె రాము, పి వీరబాబు, ఎన్‌ నాగలక్ష్మి ఎం భవాని ఐదో వార్డ్‌ మెంబర్‌ డి వెంకటరమణ, గ్రంథాలయ నిర్వహకులు వై శ్రీనివాసరావు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img