విశాలాంధ్ర- గూడూరు : గూడూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ఎం. ఆర్ .ఓ బి .విజయ ప్రసాద్ కు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము, గూడూరు మండలం అధ్యక్షులు పి.కాకులేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం గూడూరు మండలం కార్యదర్శి ఎం.డి బషీర్ మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా చనిపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు న్యాయం చేయాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే 25 లక్షలు ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు జి. ఓ .నెం.658 ప్రకారం వెంటనే ఉద్యోగం ఇవ్వాలి . ముఖ్యంగా ప్రస్తుతం వీ.ఆర్. ఏ నుండి గ్రేడ్ 2 వి.ఆర్. ఓ లుగా పనిచేస్తున్న 3795 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు వెంటనే ప్రొబిషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుచున్నాము. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వోల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. మా సమస్యలు పరిష్కారానికి మా రాష్ట్ర సంఘాన్ని చర్చలకు ఆహ్వానించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము.