విశాలాంధ్ర-జగ్గయ్యపేట : భారత కమ్యూనిస్ట్ పార్టీ( సి పి ఐ ) 98 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డిపో సెంటర్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూ నెబోయిన శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం జూ నెబోయిన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల పై నిరంతరం పోరాడేది సీపీఐ నేనని అన్నారు. దున్నే వాడిదే భూమి నినాదంతో లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణి చేయడం, బ్యాంకుల జాతీయ కరణ లో కీలక భూమి వహించడం, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో అగ్రగామిగా నిలిచిన ఘనత సీపీఐ కే దక్కుతుందని తెలిపారు. నియోజక వర్గ సహాయ కార్యదర్శి అంబో జి శివాజి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శులు మా శెట్టి రమేష్ బాబు, మహమ్మద్ అసాదు ల్లా, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నీలకంఠం శివ ప్రసాద్, సీనియర్ నాయకులు బోగ్యం నాగులు,భాను,జయరాజు తదితరులు పాల్గొన్నారు.