విశాలాంధ్ర-విజయవాడ : అధిక ధరలను అరికట్టాలని, ప్రజలపై చార్జీలు, పన్నుల భారాలను తగ్గించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చేపట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.
పడవల్లో రాయపూడికి…
చలో అమరావతి లో భాగంగా సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు నేతృత్వంలో జిల్లా నాయకులు సుమారు 100మంది రెండు పడవల్లో ఇబ్రహీంపట్నం నుంచి పడవల్లో కృష్ణా నది దాటుకుని రాజధాని పరిధిలోని రాయపూడికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.