Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

రెడ్డిగూడెం – మండలంలోని కొత్తమద్దులపర్వ గ్రామంలోని సోమవారం జగనన్న విద్యా కానుక వేడుకల్లో రెడ్డిగూడెం వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సారధ్యంలోనివైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధన్యతగా ప్రభుత్వ హైస్కూలు అభివృద్ది పరిచే బాధ్యత తీసుకుందన్నారు. గతంలో స్కూళ్ళలోని పరిస్థితిని చూసి ఆవే స్కూళ్ళను పూర్తి స్థాయిలో అభివృద్ది పరిచే కార్యక్రమంచేపట్డం జరిగిందన్నారు. రాష్ట్రంలో 45వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను మనబడి, నాడు…నేడు జాబితలో చేర్చి దాదాపు రూ. 16వేల కోట్ల ఖర్చయ్యే కార్యక్రమాన్ని తొలి విడతగా 15,715 ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేసింది. నేడు రాష్ట్ర విద్యార్థులకు అంకింత చేయనున్న జగనన్న కు మనందరం ఎంతోరుణపడి ఉంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు గంధం రామారావు, పాలంకిరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొలుసు గంగాధరావు, స్కూలు కమిటీ చైర్మన్‌ బండారు రమాదేవి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img