Friday, April 19, 2024
Friday, April 19, 2024

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సయ్యద్‌ బాబుకు ఘన సన్మానం

విశాలాంధ్ర – వత్సవాయి: జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని గరికపాడు లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డాక్టర్‌ కే ఎల్‌ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు సయ్యద్‌ బాబుకు (నాగుల్‌ మీరా ) ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయవేత్త, సమకాలీకులు అయిన సయ్యద్‌ బాబు మాట్లాడుతూ…… రైతే రాష్ట్రానికి వెన్నుముక్క అని రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఉన్నత అధికారులతో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానని…అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక
సదవకాశాలను కల్పిస్తూ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పేరు గడిచిందని అనడంలో అతిశయోక్తి లేదని,రైతులు ప్రభుత్వ రుణాలను సక్రమ స్థాయిలో ఉపయోగించుకొని ఉత్పత్తులను పెంచాలని, రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తనని సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం మరియు విశ్వవిద్యాలయం ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img