Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

తెలుగువారు మర్చిపోని మహోన్నత వ్యక్తి టంగుటూరి

గుడివాడ : తెలుగువార్కి ప్రత్యేక రాష్ట్రం కోసం విశేషంగా కృషీ చేసి తొలి తెలుగు ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారనీ గ్రంధాలయాధికారిణి కె.రమాదేవి అన్నారు. సోమవారం స్థానిక షా గులాబ్‌ చంద్‌ ప్రధమశ్రేణి శాఖా గ్రంధాలయంలో అమరజీవి టంగటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి వేడుకలను నిర్వహించారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మద్రాసిలుగా తెలుగువారిని పిలువబడే సమయంలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించిన మహోన్నత వ్యక్తి టంగుటూరి అన్నారు. అయనను ప్రతి తెలుగువారు చిరస్థాయిగా గుర్తుంచుకోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది పి.రవిచంద్ర, గ్రంధాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img