సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
విశాలాంధ్ర – గూడూరు : తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం గూడూరు మున్సిపల్ ఆఫీసు ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ మాట్లాడుతూ అకారణంగా వృద్థులు, వితంతువుల పింఛన్లు రద్దు చేయడం అన్యాయమన్నారు. రద్దుచేసిన పింఛన్లు మళ్లీ ఇచ్చేంత వరకూ పోరాడుతామన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశికుమార్ మాట్లాడుతూ మందుల కోసం ప్రతి నెలా పింఛన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వృద్ధులకు ఈ ప్రభుత్వ చర్యలతో నిరాశే మిగిలిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా, జిల్లా సమితి సభ్యులు సీవీఆర్. కుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కే. నారాయణ, ఎంబేటి చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ డివిజన్ నాయకులు బాలాజీ, యాకోబు తదితరులు పాల్గొన్నారు.