విశాలాంధ్ర, మచిలీపట్నం: మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళి తెచ్చుకున్న చేపలు ఎండబెట్టుకోవడానికి, వలలు శుభ్రం చేసుకోవడానికి పల్లెతుమ్మలపాలెంలో ప్లాట్ఫాం నిర్మించాలని మాజీ ప్రెసిడెంట్ కొక్కిలిగడ్డ దుర్గయ్య మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మంత్రి కార్యాలయం వద్దకు పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చారు. స్థానిక శారదానగర్కు చెందిన తాడంకి పురుషోత్తం గృహనిర్మాణ పథకం కింద తన స్వంతస్థలంలో ఇల్లు నిర్మించుకోవటానికి పక్కా ఇల్లు మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. స్థానిక గొడుగుపేటకు చెందిన కేశన ఆదినారాయణ తన కుమార్తె చైతన్య కాలేజ్లో చదివిందని, కళాశాల వారితో మాట్లాడి సర్టిఫికెట్స్ ఇప్పించాలని కోరారు. గొడుగుపేటకు చెందిన శాలినికుమారి తన కుమార్తెకు 11 సంవత్సరాల వయస్సు నుండి వస్తున్న వికలాంగ పింఛను ఆపివేశారని, పింఛను పునరుద్ధరించాలని కోరారు. స్థానిక హౌసింగ్బోర్డు పికెయం కాలనీకి చెందిన చిట్టిబోయిన సుజాత తన భర్త 8నెలల క్రితం చనిపోయారని, వైఎస్ఆర్ భీమా పరaథకం మంజూరు చేయించాలని కోరారు.