విశాలాంధ్ర, మచిలీపట్నం: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన పోస్టు ఆఫీసుల ద్వారా న్యాయసేవలు అనే కొత్త పథకం అమలు నేపథ్యంలో కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి శనివారం జిల్లాలో అన్ని పోస్టల్ డివిజన్ సిబ్బంది శిక్షణ నిర్వహించారు. న్యాయసంస్థ ఉపయోగాలు మరియు కొత్తగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ పనితీరును వారికి వివరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి పి.రాజారాం, జిల్లాలోని పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయవాది సిహెచ్.ముసలయ్య రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు.