Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే శిల్పా

విశాలాంధ్ర` వెలుగోడు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని , పేద లందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయనకు ప్రభుత్వ అధికారులు , వైఎస్‌ఆర్‌సిపి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పొదుపు మహిళలు పూలవర్షం కురిపించి , హారతి ఇచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు నిత్యం ప్రజల కు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తున్నారు. ఎన్నికలు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేటికీ వంద శాతం అమలు చేసిన ఘటన సి.ఎం జగన్‌ మోహన్‌ రెడ్డీకే దక్కిందన్నారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ , ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్వర్‌ రెడ్డి , ఎంపిపి లాలం రమేష్‌ , సర్పంచ్‌ జైపాల్‌ , వైస్‌ ఎంపిపి శంకర్‌ నాయక్‌ రైతు సంఘము అధ్యక్షుడు తెలుగు రమణ , అంబాల ప్రభాకర రెడ్డి , రామ్మోహన్‌ రెడ్డి , సూర్యనారాయణ , గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img