Friday, April 19, 2024
Friday, April 19, 2024

భారత్‌బంద్‌ జయప్రదం కోరుతూ ప్రదర్శన

విశాలాంధ్ర, విస్సన్నపేట టౌన్‌: ఈనెల 27న భారత్‌బంద్‌ జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ నాయకులు శనివారం విస్సన్నపేటలో ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎం.త్యాగరాజు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్రమోదీ కార్పొరేట్‌ ప్రయోజనాలే లక్ష్యంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అన్నదాతలు కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళన, రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరల అదుపు డిమాండ్‌ చేస్తూ జరిగే ఈ బంద్‌కు అన్ని వర్గాల మద్ధతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మోతే శోభనాచలం, పసుపులేటి వరప్రసాద్‌, పితాని నాగేశ్వరరావు, పొన్నగంటి కృష్ణప్రసాద్‌, పీఎస్‌.మోహనరావు, మేడా వెంకటేశ్వరరావు, పతకమూడి మన్మథరావు, విస్సంపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img