Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మీలాంటి కరెంటు ఏఈని ఎక్కడా చూడలేదు – ప్రజా ప్రతినిధులు

విశాలాంధ్ర`వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయిలోని స్థానిక ఎంపీడీవో ఎస్‌ వి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో మండలం ఎంపీపీ చెంబేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ విద్యుత్‌ శాఖ పురోగతిని తెలిపేందుకు మైకు ఇవ్వగా విద్యుత్‌ శాఖ ఏఈ వెంకటేశ్వరరావు పై విమర్శలను గుప్పించారు ప్రజాప్రతినిధులు. గతంలో రెండు పర్యాయాలు జరిగిన సర్వసభ్య సమావేశంలో విద్యుత్‌ శాఖ పూర్తిస్థాయిలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయేలా ఉన్న నిర్లక్ష్యం వలన పలువురికి ప్రమాదాలు జరిగిన సంఘటనలు మండలంలో చాలా ఉన్నప్పటికీ ఆ సమస్యలను విద్యుత్‌ శాఖ అధికారి వెంకటేశ్వరరావుకు తెలియజేసినప్పటికీ ఆయన తన పందాను మార్చుకోలేదని ఆగ్రహ రూపం దాల్చారు ప్రజా ప్రతినిధులు…. దేచుపాలెం, చిన్న మోదుగుపల్లి,పెద్ద మోదుగు పల్లి,పోలంపల్లి,మంగోల్లు,మొదలగు గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని పలుమార్లు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఏ ఈ మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పూర్తిస్థాయిలో అసంతృప్తి చెందిన ప్రజా ప్రతినిధులు…. జీతం కోసం పని చేస్తారు కానీ ప్రజల కోసం పని చేయరా అని సభా సమావేశంలో ఏఈని నిలదీశారు. ఇటువంటి ఏఈ ని ఇప్పటివరకు మండలంలో చూడలేదని ప్రజా సమస్యలను పరిగణలోనికి తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలి కానీ టైం పాస్‌ ఉద్యోగాలు చేస్తే అత్యవసర శాఖ అయినా విద్యుత్‌ శాఖ ఏఈ నిర్లక్ష్యంతో ప్రజలకు శాపంగా మారిందని ఏఈతన వైఖరిని మార్చుకోవాలని ఎంపీపీ హితవు పలికారు, వచ్చే సమావేశానికి సమస్యలు పరిష్కరించక పోయిట్లయితే విద్యుత్‌ శాఖ అధికారి పై ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని ఎంపీడీవో తెలిపారు…. ఈ కార్యక్రమంలో ఇటీవల కాలంలో జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గా నియమితులయిన ముత్తినేని విజయ శేఖర్‌ మరియు డైరెక్టర్‌ గా ఎంపిక కాబడిన పండగ శ్రీనివాసరావు మరియు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎంపిక కాబడిన గంగిపోకు శిరీష రమేష్‌ లకు శాలువాలతో ప్రజా ప్రతినిధులు ఘన సన్మానం చేశారు….ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ అధ్యక్షులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img