కంచికచర్ల : రైతు సంక్షేమం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఏ సమస్యను ఎదుర్కొకుండా చేయ్యడానికి కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమం రైతు స్పందన కార్యక్రమం అని స్థానిక తహశీల్దార్ వి.రాజకుమారి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యలయంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు స్పందన కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్ని రైతుల నుంచి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన నందిగామ వ్యవసాయ సహాయ సంచాలకులు డి.రమణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఏ ఒక్క సమస్య ఉండకూడదు అని ప్రతి నెల మొదటి , మూడవ బుధవారం ప్రతి మండలంలోని రైతు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో రైతులకు ఉన్న ఇబ్బందులపై సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టుకుంటే, ఆ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కరించటం జరిగుతుందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రైతు కంటిలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారన్నారు. మండలంలోనిరైతులుఈ అవకాశని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవలన్నారు. ఈయొక్క రైతు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పర్యవేక్షణలో నిరంతరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రెంటపల్లి సురేష్, ఎం.నగరాజు నాయక్, పశువైద్యాధికారి బి.శంకర్ నాయక్, ట్రాన్స్కో ఏఈఈ జి.రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.